రేపటి నుండి జేఈఈ మెయిన్స్ పరీక్షలు

February 22, 2021
img

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు రేపటి నుండి ప్రారంభమై నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 నుండి 6గంటల వరకు జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఆన్‌లైన్‌  ద్వారా నిర్వహిస్తారు. ఈ సారి జరగబోయే ఈ పరీక్షలో మొదటిసారిగా 11 స్థానిక భాషలలో పరీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జేఈఈ పరీక్ష కోసం 1,61,579 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్లగొండ,ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, 

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాల్సిందిగా సూచించారు. కరోనా లేదని సెల్ఫ్ డెకరేషన్ డిక్లరేషన్ ఫామ్‌ను కూడా వెంట తీసుకురావాలని పరీక్షల నిర్వాహకులు తెలిపారు.


Related Post