రేపు కరీంనగర్లో జాబ్మేళా జరగనుంది. ముకరంపురలోని స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జాబ్మేళా జరగనుంది. దీనిలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్మేళాలో ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ( ఫైనాన్స్) విద్యార్హతలు కలిగినవారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. దీనిలో పాల్గొనదలచిన అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటి జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు పత్రం వంటివన్నీ తెచ్చుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
జాబ్ మేళా నిర్వహించే స్థలము: పద్మనాయక కళ్యాణ మండపం, ముకరంపుర, కరీంనగర్.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్::8686100201