శనివారం రథ సప్తమి సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆలయాలకి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. హైదరాబాద్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రి, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, కీసరగుట్ట తదితర ప్రధాన ఆలయాలకి 80 బస్సులని నడిపించబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్లో కేపీహెచ్బీ నుంచి అనంతగిరికి 5, మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి మన్నెంకొండకి 10, కరీంనగర్ నుంచి వేములవాడకి 10, ధర్మపురికి 10, నల్గొండ నుంచి యాదాడ్రికి 10 ప్రత్యేక బస్సులు నడిపిస్తామని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో పెద్దమతల్లి, చిలకలూరు బాలాజీ, సికింద్రాబాద్ మహంకాళీ, హిమాయత్ నగర్లోని బాలాజీ మందిరంకి నగరంలో అన్ని ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తామని తెలిపారు. కనుక భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.