హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వెళ్తున్న భక్తులకు శుభవార్త! ఈ సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ నుంచి తిరుపతికి నాలుగు ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది. సెప్టెంబర్ 6,13,20,27 తేదీలలో హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైళ్ళు బయలుదేరుతాయి. వీటికి ట్రైన్ నెంబర్: 07489 కేటాయించినట్లు తెలిపింది. ఆన్లైన్లో వీటిలో టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మద్య రైల్వే తెలిపింది.
ఇవి సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సులేహల్లి, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ మర్నాడు ఉదయం 8.45 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకొంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేందుకు వన్-వే ట్రెయిన్స్ మాత్రమే. తిరుగు ప్రయాణం వేరే ట్రైన్స్లో రావలసి ఉంటుంది.