నిజామాబాద్‌-సిర్పూర్ మద్య పుష్-పుల్ ట్రైన్ ప్రారంభం

July 27, 2022
img

నిజామాబాద్‌-సిర్పూర్ మద్య పుష్-పుల్ డెమూ ట్రైన్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రతీరోజు ఉదయం 4.45 గంటలకు నిజామాబాద్‌ జంక్షన్ నుంచి బయలుదేరి 7.55 గంటలకు కరీంనగర్‌, 8.28 గంటలకు పెద్దపల్లి, 9.04 గంటలకు మంచిర్యాల, 11.05 గంటలకు సిర్పూర్ టౌన్ చేరుకొంటుంది. మళ్ళీ 11.50 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యి మధ్యాహ్నం 1.04 గంటలకు మంచిర్యాల, 2.10 గంటలకు కరీంనగర్‌ , రాత్రి 8.10 గంటలకు నిజామాబాద్‌ జంక్షన్ చేరుకొంటుంది. 

ఈ మార్గంలో సిర్పూర్ కాగజ్ నగర్‌ టౌన్, ఆసిఫాబాద్ రోడ్, రేచిని రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్‌, గంగాధర, జగిత్యాల, లింగంపేట, కోరుట్ల,    మెట్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూరు స్టేషన్లలో ఈ పుష్-పుల్ రైళ్ళకు హాల్టింగ్ ఉంది. 

ఈ రైళ్ళ వలన నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజల రాకపోకలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

Related Post