తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫ్రాన్స్ దేశానికి చెందిన సాఫ్రాన్ గ్రూప్ రూ.1,200 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్వోను ఏర్పాటుచేయబోతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా సఫ్రాన్ గ్రూప్కు చెందిన కంపెనీలలో ఇదే అతిపెద్దది… భారత్లో ఏర్పాటవుతున్న తొలి అంతర్జాతీయ ఇంజిన్ ఎంఆర్వో అని కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థలో సుమారు 800 నుంచి 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ సంస్థ రాకతో హైదరాబాద్ నగరం ఏరో స్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.