ప్రపంచవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో అంతర్జాతీయ విమాన సేవలపై ఫిబ్రవరి 28వరకు నిషేదం పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసీఏ) ప్రకటించింది. అయితే అంతర్జాతీయ కార్గో సర్వీసులకు, డిజిసీఏ అనుమతించిన సర్వీసులకు ఈ ఆంక్షలు వర్తించవని తెలిపింది. అలాగే ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకొన్న అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఫ్రాన్స్ తదితర 32 దేశాలకు విమాన సేవలకు కూడా ఈ ఆంక్షలు వర్తించవని సర్క్యులర్ ద్వారా తెలియజేసింది.