ఆదాయపన్ను శాఖ పాన్కార్డ్-ఆధార్ అనుసంధానానికి గడువు మరోసారి పొడిగించింది. పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరో ఆరు నెలలపాటు అంటే 2022, మార్చి 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో వరుసగా నాలుగవసారి గడువు పొడిగించినట్లు అయ్యింది. కంపెనీలు తమ ఉద్యోగులకు కోవిడ్ చికిత్సకు చెల్లిస్తున్న సొమ్ముకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.