శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు నేరుగా నాన్ స్టాప్ విమానాల సేవలను ఎయిర్ ఇండియా శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో హైదరాబాద్ నుంచి లండన్లోని హిత్రు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 9 గంటలలోనే చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి నేరుగా లండన్కు వారంలో రెండు రోజులు సోమ, శుక్ర వారాలలో ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో హైదరాబాద్ నుంచి నేరుగా లండన్కు రాకపోకల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల చిరకాలవాంఛ నెరవేరింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కూడా ఈ విమాన సేవలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు, శంషాబాద్ జిఎంఆర్ విమానాశ్రయ ఉన్నతాధికారులన్నారు.