నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను రాత్రి 11.15 గంటల వరకు పొదిగిస్తున్నట్లు మెట్రో సంస్థ ప్రకటించింది. ప్రతీరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపింది. మెట్రోలో చివరి స్టేషన్లు ఎల్బీ నగర్, మియాపూర్, రాయదుర్గం, నాగోల్ నుంచి రాత్రి 10.15 గంటలకు చిట్ట చివరి మెట్రో రైళ్ళు బయలుదేరి 11.15 గంటలకు గమ్యస్థానాలు చేరుకొంటాయని మెట్రో సంస్థ ప్రకటనలో తెలిపింది.
త్వరలో పండుగల సీజన్ మొదలవుతుంది కనుక మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగవచ్చు. ఒకవేళ రద్దీ పెరిగితే తదనుగుణంగా మెట్రో రైళ్ళ ఫ్రీక్వెన్సీ, సంఖ్య పెంచే అవకాశం ఉంది.