హైదరాబాద్ శివార్లలో కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లోని భూముల ఆన్లైన్ వేలంపాట ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. అధికారులు ఎకరాకు కనిష్ట ధర రూ.25-31. 2 కోట్లు నిర్ణయించగా వేలంపాటలో ఎకరం గరిష్టంగా రూ.60.20 కోట్లు పలికింది. మొత్తం మీద చూసుకొంటే ఎకరం సగటున రూ.40. 05కోట్లు పలికింది. ఈ వేలంపాటలో మొత్తం 60 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ఆన్లైన్లో వేలంపాట మొదలవగానే పోటాపోటీగా ధర పెంచుకొంటూపోయి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించారు. మొత్తం 50 ఎకరాలను 8 ప్లాట్లుగా విభజించి వేలం వేయగా అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ వేలంపాట ద్వారా హెచ్ఎండీఏకు రూ.2000.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలంపాట హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా ఏమిటో మరోసారి చాటి చూపిందని చెప్పవచ్చు.
ఈ వేలంపాటలో నెంబరు: 2/పీ వెస్ట్ పార్ట్ ప్లాటులోని 1.65 ఎకరాలను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్లు చొప్పున మొత్తం రూ.99.33 కోట్లు చెల్లించి సొంతం చేసుకొంది. ఈ వేలంపాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ప్లాట్ ఇదే.
వీటిలో ఒక ఎకరం విస్తీర్ణం కాగిగిన ప్లాట్ నెంబర్: ఏను హెచ్ఎండీఏ నిర్ణయించిన కనిష్టధర రూ.31.2 కోట్ల చొప్పున హైమా డెవలపర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈవేలంపాటలో అత్యంత తక్కువ ధరకు అమ్ముడుపోయిన ప్లాట్ ఇదొక్కటే.
కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ ఔటర్రింగ్ రోడ్డును ఆనుకొని ఉండటం, దానిలో 20-30 అంతస్తుల భవనాలు కట్టుకొనేందుకు ప్రభుత్వం అనుమతిస్తుండటంతో వేలంపాటలో బిడ్డర్లు పోటీపడి కొనుగోలు చేశారు. వేలంపాట వివరాలు:
ప్లాట్ (ఎకరాలలో) |
ఎకరాకు చెల్లించిన ధర (కోట్లలో) |
అమ్ముడైన ధర (కోట్లలో) |
దక్కించుకొన్న వ్యక్తి, సంస్థ పేరు |
7.721 |
42.2 |
325.83 |
మన్నే సత్యనారాయణ రెడ్డి |
7.755 |
42.4 |
328.81 |
రాజపుష్ప ప్రాపర్టీస్ |
7.738 |
36.4 |
281.66 |
ఆక్వా స్పేస్ డెవలపర్స్ |
7.564 |
37.8 |
285.92 |
ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ |
8.946 |
39.2 |
350.68 |
ఆక్వా స్పేస్ డెవలపర్స్ |
7.575 |
39.2 |
296.94 |
వర్శిటీ ఎడ్యుకేషన్ మేనేజిమెంట్ |
1 |
31.2 |
31.2 |
హైమా డెవలపర్స్ లిమిటెడ్ |
1.65 |
60.2 |
99.33 |
రాజపుష్ప ప్రాపర్టీస్ |