తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నుండి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో మెట్రో రైల్ సర్వీసుల సమయాన్ని కూడా పెంచారు. నేటి నుండి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతామని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది అందరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.