రైల్వే స్టేషన్లలో బందుమిత్రులను తీసుకువెళ్ళడానికో లేదా సాగనంపేందుకో వచ్చినవారు ప్లాట్ఫారం టికెట్ తీసుకొంటారని అందరికీ తెలుసు కానీ ఇకపై ప్లాట్ఫారం టికెట్ ఉంటే నిర్భయంగా మనం వెళ్లాలనుకొనే రైలు ఎక్కేయవచ్చు. రైలు ఎక్కిన తరువాత టీటీఈ దగ్గరకు వెళ్ళి మనం ఎక్కడి వరకు ప్రయాణించాలనుకొంటున్నామో తెలియజేసి, డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవచ్చునని భారతీయ రైల్వే శాఖ తెలియజేసింది. అయితే బెర్త్/ సీట్ కొరకు(ఖాళీ ఉన్నట్లయితే) రిజర్వేషన్ ఛార్జీలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ బెర్త్/సీట్ ఖాళీ లేకపోతే జనరల్ బోగీలో ప్రయాణించవలసి ఉంటుంది.