మరో వారం రోజులలో భారత్ మార్కెట్లోకి రష్యా తయారుచేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయబోతున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ ఈరోజు వ్యాక్సిన్ ధరను ప్రకటించింది. ఒక్కో డోస్ వాక్సిన్ ధర 5 శాతం జీఎస్టీతో కలుపుకొని రూ.995.40గా నిర్ణయించినట్లు ప్రకటించింది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న అమెరికా వాక్సిన్ కొవీషీల్డ్ ఒక్కో డోస్ ప్రభుత్వాలకు రూ.300 చొప్పున, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600 చొప్పున ఇస్తోంది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ ఒక్కో డోస్ ప్రభుత్వాలకు రూ.400 చొప్పున, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1,200 చొప్పున ఇస్తోంది.