రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా...అయితే ఇది మీకే!

March 06, 2021
img

మీ కుటుంబ సభ్యులనో లేదా బంధుమిత్రులనో సాగనంపేందుకు లేదా రిసీవ్ చేసుకొనేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా...అయితే ముందు ఈ వార్త చదవండి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో నేటి నుంచి ప్లాట్‌ఫాం టికెట్ రుసుమును రూ.10 నుంచి రూ.30కి పెంచుతున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నందున రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. కరోనా తీవ్రత తగ్గితే ప్లాట్‌ఫాం టికెట్ రుసుమును మళ్ళీ తగ్గిస్తామని తెలిపింది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండటంతో ముంబై, పూణే, కళ్యాణ్, థానే, భీవాండీ రోడ్ రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ రుసుమును రూ.10 నుంచి రూ.50కి పెంచిన సంగతి తెలిసిందే. కనుక రైల్వే స్టేషన్‌కు ఎంతమంది వెళ్ళాలో వెళ్తే లోపలకు ఎంతమంది వెళ్ళాలో ముందే ఆలోచించుకొని బయలుదేరడం మంచిది. లేకుంటే పర్సు ఖాళీ అయిపోతుంది. 


Related Post