గత ఏడాది మార్చిలో కేంద్రప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు అనేక వేల రైళ్ళు మూలపడి ఉన్నాయి. ఆ తరువాత క్రమంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ళ పేరుతో 138 జతల రైళ్ళను తిప్పుతున్నప్పటికీ 135 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్కు ఏమాత్రం సరిపోవడంలేదు. దాంతో ప్రజలు... ముఖ్యంగా సామాన్య ప్రజలు దూరప్రాంతాలకు వెళ్ళిరావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో దాదాపు అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ ఒక్క రైల్వేశాఖ మాత్రమే ఇంకా కరోనా సాకుతో రైళ్ళు తిప్పకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహుశః అందుకే రైల్వేశాఖ మేల్కొని ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీలోగా 11 జతల రైళ్ళను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది.
రైలు నెంబర్ |
ఎక్కడి నుంచి |
ఎక్కడి వరకు |
ఏ రోజున |
02799 |
విజయవాడ |
సికింద్రాబాద్ |
ప్రతీరోజు |
02800 |
సికింద్రాబాద్ |
విజయవాడ |
ప్రతీరోజు |
07251 |
గుంటూరు |
కాచిగూడ |
ప్రతీరోజు |
007252 |
కాచిగూడ |
గుంటూరు |
ప్రతీరోజు |
02739 |
సికింద్రాబాద్ |
విశాఖపట్నం |
ప్రతీరోజు |
02740 |
విశాఖపట్నం |
సికింద్రాబాద్ |
ప్రతీరోజు |
07409 |
ఆదిలాబాద్ |
నాందేడ్ |
ప్రతీరోజు |
07410 |
నాందేడ్ |
ఆదిలాబాద్ |
ప్రతీరోజు |
02735 |
సికింద్రాబాద్ |
యశ్వంత్పూర్ |
బుద, శుక్ర, ఆదివారం |
02736 |
యశ్వంత్పూర్ |
సికింద్రాబాద్ |
సోమ, గురు, శనివారం |
07207 |
విజయవాడ |
సాయినగర్ (షిర్డీ) |
మంగళవారం |
07208 |
సాయినగర్ (షిర్డీ) |
విజయవాడ |
బుదవారం |
07621 |
ఔరంగాబాద్ |
రేణిగుంట |
శుక్రవారం |
07622 |
రేణిగుంట |
ఔరంగాబాద్ |
శనివారం |