త్వరలో కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ షురూ

February 24, 2021
img

కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా నిలిపివేయబడిన గుంటూరు-కాచిగూడా-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ సేవలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 7 గంటలకు గుంటూరు నుంచి (ట్రైన్ నెంబర్:17252) బయలుదేరి నరసారావుపేట, మార్కాపురం, కర్నూల్ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్ మీదుగా మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకొంటుంది. మళ్ళీ ఏప్రిల్ రెండో తేదీ మధ్యాహ్నం 3.10 గంటలకు కాచిగూడ నుంచి (ట్రైన్ నెంబర్:17251) బయలుదేరి మర్నాడు ఉదయం 6.45 గంటలకు గుంటూరు చేరుకొంటుంది.   


Related Post