అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు టీఎస్ఆర్టీసీని లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఇస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో
సామాన్య ప్రజలు వారి సొంత వాహనాన్ని పక్కకు పెట్టి ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడానికి మొగ్గు
చూపుతున్నారిప్పుడు. ఇదే ఇప్పుడు ఆర్టీసీని లాభాల బాట
పట్టేందుకు తోడ్పడింది. మరీ ముఖ్యంగా...హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సులలో
ప్రయాణించేవారి
సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని మరిన్ని బస్సులను నడిపేందుకు అన్ని
డిపోల అధికారులతో చర్చిస్తున్నామని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ
బస్సులలో ఆక్యుపెన్సీని పెంచే డ్రైవర్లకు, కండక్టర్లకు నగదు
ప్రోత్సాహకాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.