నెల్లూరు జిల్లా శ్రేహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో సోమవారం భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్పేస్ రాకెట్ను నిలబెట్టేందుకు ఉపయోగించే రెండు ప్లాట్ ఫారంలు కూలిపోయాయని తెలుస్తోంది. వాటికి సిబ్బంది మరమత్తులు చేస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రెండూ కూలిపోయాయని తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది కానీ ఈ ప్రమాదం వలన సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు. ఈ ప్రమాదంపై షార్ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టింది. ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.