టీమ్ ఇండియా కోచ్ గా రవిశాస్త్రిని నియమించినట్లు కొద్దిసేపటి క్రితమే బిసిసిఐ ప్రకటించింది. మళ్ళీ ఇంతలోనే ఏమయిందో తెలియదు కానీ మీడియాలో వచ్చిన ఆ వార్తలు నిజం కావని, కోచ్ గా ఎవరిని నియమించాలనే విషయంపై క్రికెట్ సలహా కమిటీ ఇంకా చర్చలు జరుపుతోందని బీసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి చెప్పడం విశేషం. కనుక కోచ్ గా ఎవరికి అవకాశం ఇస్తుందనేది మళ్ళీ సస్పెన్స్ గా మారింది. ఈరోజు సాయంత్రంలోగా తప్పనిసరిగా కోచ్ పేరు ప్రకటించాలని బిసిసిఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించినందున బహుశః మరికొద్ది సేపటిలో బిసిసిఐ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.