భారత్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన పూర్తయిన తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్తో నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ టెస్ట్ మ్యాచ్లు వచ్చే నెల 5నుంచి ప్రారంభం కానున్నాయి.
పితృత్వపు సెలవుల కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ మ్యాచ్లకు తిరిగి కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజాకె రహానే ఉన్న సంగతి తెలిసిందే.
స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
విరాట్ కోహ్లీ( కెప్టెన్), అజాకె రెహనా( వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్( వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహో( వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహోలలో ఎవరో ఒకరిని వికెట్ కీపర్గా తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. మ్యాచ్ జరగబోయే ముందు జట్టులో సల్పమార్పులు ఉండవచ్చని బీసీసీఐ తెలిపింది.
టెస్ట్ మ్యాచ్ల వివరాలు:
మొదటి టెస్ట్ మ్యాచ్: ఫిబ్రవరి తేదీ 5నుండి 9 వరకు, వేదిక: చెన్నై
రెండవ టెస్ట్ మ్యాచ్: ఫిబ్రవరి తేదీ 13 నుండి 17వరకు, వేదిక: చెన్నై
మూడవ టెస్ట్ మ్యాచ్: ఫిబ్రవరి 24 తేదీ నుండి 28వరకు, వేదిక: అహ్మదాబాద్. (ఈ టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ గా జరగనుంది).
నాలుగో టెస్ట్ మ్యాచ్: మార్చి 4వ తేదీ నుండి 8వరకు, వేదిక: అహ్మదాబాద్.