ఆస్ట్రేలియాలో గబ్బ స్టేడియంలో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భారత్ 2-1తో సిరీస్ గెలుచుకొంది.328 రన్స్ భారీ లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లలోనే చేధించింది. అది కూడా...విరాట్ కొహ్లీ వంటి సీనియర్లు లేకుండానే ఆస్ట్రేలియాను దాని గడ్డపైనే ఓడించడం ఇంకా విశేషం.
నాలుగో టెస్ట్ మ్యాచ్ చివరిరోజు ఆట చాలా రసవత్తరంగా
జరిగింది. భారత్ నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్కు వచ్చింది.
భారీ లక్ష్యం ముందున్నప్పటికీ భారత బ్యాట్స్ మెన్ అద్భుతంగా రాణించడంతో భారత జట్టు
ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ 89, వాషింగ్టన్ సుందర్
22, శుభమన్ గిల్ 91, చటేశ్వర్ పుజారా
56 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. రిషబ్ పంత్, శుభమన్ గిల్కు గతంలో విదేశాలలో ఆడిన అనుభవం లేనప్పటికీ ఆస్ట్రేలియా
బౌలర్లను ధాటిగా ఎదుర్కొని భారత్కు ఘన విజయాన్ని అందించారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 336 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 294 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 329/7