ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్లోని గబ్బ స్టేడియంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా 22 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 294 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో స్టీవ్ స్మిత్ 55 పరుగులు, డేవిడ్ వార్నర్ 48 పరుగులు, కామరున్ గ్రీన్ 37 పరుగులతో టాప్ స్కోరర్స్ గా ఉన్నారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్కు ఐదు వికెట్లు పడగా, శార్దూల్ ఠాకూర్కు నాలుగు వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా 328 పరుగుల ఆధిక్యంలో ఉంది.
భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (4), శుబుమన్ గిల్ ఇంకా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. భారత్ గెలవడానికి ఇంకా 324 పరుగుల చేసి చేయాల్సి ఉండగా ఐదో రోజు మ్యాచ్ రేపు జరుగనుంది. ఇప్పటికే సిరీస్ సమంగా ఉంది కనుక ఒకవేళ భారత్ జట్టు బ్యాటింగ్లో రాణించినట్లయితే గెలుపు మనదవుతుంది.