ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లోని గబ్బ స్టేడియంలో జరుగుతున్న భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో 274 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు మరో 95 పరుగులు అంటే 369 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్లకు తలా మూడు వికెట్లు పడగా, మహమ్మద్ సిరాజ్కు ఒక వికెట్ పడింది. ఆ తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చింది. ఓపెనర్లుగా శుభమన్ గిల్, రోహిత్ శర్మలు బ్యాటింగ్కు వచ్చారు.
శుభమన్ గిల్ 7 పరుగులు చేసి నాథన్ లియన్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 44 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో అవుటయ్యారు. వర్షం కారణంగా రెండో రోజు ఆట ముగిసింది. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా 8 పరుగులతో, అజింక్య రహానే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆటలో భారత్ 62 పరుగులతో 2 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా 307 పరుగులు వెనకబడి ఉంది.