మాజీ క్రికెటర్ మరియు మాజీ సెలెక్టర్ విబి చంద్రశేఖర్ (58) గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన 1988 నుంచి సుమారు మూడేళ్ళుపాటు భారత్ తరపున ఏడు వన్డే మ్యాచ్ లు ఆడి ఓపెనర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన 81 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి మొత్తం 4999 పరుగులు చేశారు. ఆయన అత్యుత్తమైన స్కోరు 237 (నాటవుట్). తమిళనాడుకు చెందిన ఆయన డబ్ల్యూవిరామన్, లక్ష్మణ్ శివరామకృష్ణన్ వంటి మేటి క్రికెటర్లతో ఆడారు. చంద్రశేఖర్ జాతీయజట్టు సెలెక్టర్గా బిసిసిఐకి సేవలందించారు.