ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. ఆమె తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్తో ప్రేమలో పడి చాలా కాలమే అయ్యింది. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది డిసెంబర్ 16న వారి వివాహం జరుగబోతోంది. డిసెంబర్ 21న వారు హైదరాబాద్లో రిసెప్షన్ పార్టీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.