ఇటీవల మెల్ బోర్న్ లో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ లో భారత్ కు రజత పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి అరుణా బుద్దారెడ్డికి దక్షిణ మద్య రైల్వే ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. ఆమెకు గ్రూప్-సి స్థాయి ఉద్యోగం ఇచ్చినట్లు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ మీడియాకు తెలియజేశారు. రైల్వే శాఖ క్రీడాకారులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని, అందుకే అరుణా బుద్దారెడ్డికి ఉద్యోగం ఇచ్చామని తెలిపారు.