పట్టాలు తప్పి రోడ్డుపై పడిన రైలు

December 19, 2017
img

అమెరికాలో అనూహ్యమైన ఒక రైలు ప్రమాదం జరిగింది. వాషింగ్టన్ రాష్ట్రంలో సీటెల్ నుంచి పోర్ట్ లాండ్ వెళుతున్న అమ్ట్రాక్ రైలు ఒక వంతెనపై నుంచి వెళుతుండగా 13 బోగీలు పట్టాలు తప్పి క్రిందన వెళుతున్న వాహనాలపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్నవారిలో సుమారు 100 మంది గాయపడగా, ఆ రైలు క్రింద వాహనాలలో నలిగిపోయి ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అమెరికా కాలమానప్రకారం సోమవారం ఉదయం వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే సౌత్ సీటెల్ వద్ద జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో బారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విశేషమేమిటంటే, ఆ రైలుకు అప్పుడే ప్రారంభోత్సవం చేసుకొని మొదటిసారిగా ప్రయణిస్తోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ, మంచి నిర్వహణ వ్యవస్థలతో అన్ని జాగ్రత్తలు తీసుకొనే అమెరికాలో కూడా ఇటువంటి రైలు ప్రమాదాలు జరుగడం విచిత్రమే.               


Related Post