న్యూజెర్సీలో తెలంగాణవాసి మృతి

December 24, 2020
img

హన్మకొండలోని భవానీ నగర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ (37) అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీలో ఓ రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో చనిపోయాడు. ప్రవీణ్ కుమార్ సుమారు నాలుగేళ్ళ క్రితం భార్య నవతతో కలిసి న్యూజెర్సీకి వెళ్ళి అక్కడే ఇద్దరూ ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడ్డారు. వారికి గగన్ అనే మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు.

ప్రవీణ్ కుమార్ రోజూలాగే మొన్న మంగళవారంనాడు న్యూజెర్సీలోని తమ నివాసం ఉంటున్న ఎడిసన్ టౌన్‌షిప్ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు కారులో వెళుతుండగా దారిలో ఓ రైల్వే ట్రాక్ దాటుతున్నప్పుడు వేగంగా దూసుకువచ్చిన ఓ రైలు కారును ఢీకొనడంతో చనిపోయాడు. ఈ విషయం తెలుసుకొన్న అతని భార్య నవత, ప్రవీణ్ కుమార్‌ తల్లితండ్రులు అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ తండ్రి రాజమౌళి వరంగల్‌ అర్బన్ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా పనిచేసి పదవీ విరమణ చేసారు.              


Related Post