మదీనాలో ఘోరరోడ్డు ప్రమాదం

October 17, 2019
img

సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న బస్సును ఎదురుగా వస్తున్న మరో వాహనం డ్డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. బుదవారం రాత్రి సుమారు 7 గంటలకు మదీనాకు 170 కిమీ దూరంలో ఉన్న అల్ అక్కాల్ అనే గ్రామం ఈ ప్రమాదం సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన బస్సులో అందరూ విదేశీయాత్రికులే ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన, మృతి చెందినవారి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, సహాయ బృందాలు క్షతగాత్రులను సమీపంలో గల అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు.



Related Post