సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న బస్సును ఎదురుగా వస్తున్న మరో వాహనం డ్డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. బుదవారం రాత్రి సుమారు 7 గంటలకు మదీనాకు 170 కిమీ దూరంలో ఉన్న అల్ అక్కాల్ అనే గ్రామం ఈ ప్రమాదం సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన బస్సులో అందరూ విదేశీయాత్రికులే ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన, మృతి చెందినవారి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, సహాయ బృందాలు క్షతగాత్రులను సమీపంలో గల అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు.