భారత్ కాలమానప్రకారం హ్యూస్టన్ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన హౌడి మోడీ సభకు అమెరికా నలుమూలల నుంచి వేలాదిగా ప్రవాస భారతీయులు తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి స్టేడియంలోకి అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మోడీ సభకు అంతమంది ప్రవాస భారతీయులు హాజరవడం, వారి ఉత్సాహం, కేరింతలు చూసి అవాకయ్యినట్లు కనిపించారు కూడా. ఈ వీడియోలను చూస్తే ఆ విషయం మీకే అర్ధం అవుతుంది.