అమెరికాలో తెలంగాణ విద్యార్ది మృతి

April 23, 2019
img

అమెరికాలో ఉన్నత విద్యాభాసం చేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి అనే విద్యార్ది బోస్టన్ బీచ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈస్టర్ సందర్భంగా శ్రావణ్ తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు  బోస్టన్ బీచ్‌కు వెళ్ళాడు. వారందరూ బీచ్‌లో దిగినప్పుడు భారీ కెరటాలు రావడంతో శ్రావణ్ వాటిలో కొట్టుకుపోగా మిగిలినవారు అతికష్టం మీద బయటపడ్డారు. వెంటనే రంగంలో దిగిన బీచ్ పెట్రోల్ బృందం సముద్రంలో గాలించగా కొంతసేపు తరువాత శ్రావణ్ మృతదేహం లభించింది. శ్రావణ్ మరణించాడన్న సమాచారం తెలుసుకొని బెల్లంపల్లిలో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బోస్టన్ నగరంలోని తెలుగు సంఘాలు శ్రావణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌ పంపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.      


Related Post