అమెరికాలో ప్రవాస భారతీయకుటుంబం మృతి

April 17, 2018
img

అమెరికాలో స్థిరపడిన ఒక ప్రవాస భారతీయకుటుంబంలో నలుగురు సభ్యులు అనూహ్యంగా మృతి చెందారు.   గుజరాత్ కు చెందిన సందీప్ (41), భార్య సౌమ్య (38), వారి కుమారుడు సిద్దాంత్ (12), కుమార్తె సాచి (9) పోర్ట్ ల్యాండ్ లో ఉంటున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో నివాసం ఉంటున్న తమ బంధువులతో సరదాగా గడిపి వచ్చేందుకు వారు 10 రోజుల క్రితం తమ కారులో వెళుతుండగా, వారి కారు ప్రమాదవశాత్తు కాలిఫోర్నియాలోని ఈల్ నదిలో పడిపోయింది. అప్పటి నుంచి వారి ఆచూకి కోసం వెతుకుతున్న పోలీసులు చివరికి వారు కారు పడిపోయిన ప్రదేశాన్ని గుర్తించి దానిని క్రేన్స్ సహాయంతో బయటకు తీయగా దానిలో సందీప్, సౌమ్య, సాచి మృతదేహాలు కనిపించాయి. దాంతో సిద్దాంత్ కోసం మళ్ళీ ఈల్ నదిలో గాలింపు చర్య చేపట్టారు. అమెరికాలో అన్నివిధాల స్థిరపడి పూలనావలా సాగిపోతున్న వారి నలుగురి జీవితాలు ఈవిధంగా ముగియడం చాలా బాధాకరమే. 


Related Post