అమెరికాలో హారిస్ బర్గ్ లో స్థిరపడిన ప్రవాస భారతీయులు శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారు. హారిస్ బర్గ్ సాయి సేవా సమితి అధ్వర్యంలో మార్చి 25వ తేదీన ఎనోలాలో గల ఎనోలా ఫైర్ హాల్ లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆరోజు సాయంత్రం షిరిడి బాబాకు సంధ్యాహారతితో కార్యక్రమాలు మొదలుపెట్టి భజనలు, శ్రీ సీతారామ కల్యాణం, మళ్ళీ శెజ్ హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీతారాములవారి కల్యాణోత్సవం కనులార దర్శించుకొనేందుకు అనేకమంది తెలుగువారు తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు. కార్యక్రమాలు ముగిసిన తరువాత భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.