చరణ్-ఎన్టీఆర్ సినిమా కథ ఇదే..!

December 11, 2017


img

రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న సినిమాపై రోజుకో సంచలన వార్త ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుండగా ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు బాక్సర్స్ గా కనిపిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా కుటుంబ కథా నేపథ్యంతో సాగుతుందని తెలుస్తుంది. అందుకే గ్రాఫిక్స్ లాంటివి లేకుండా సినిమా తెరకెక్కించాలని చూస్తున్నాడు రాజమౌళి.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుందట. 2018 అక్టోబర్ లో సినిమా మొదలవనుందని తెలుస్తుంది. మొదటి షాట్ ఎన్.టి.ఆర్ పై చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను తమిళ, హింది భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు ఉంటే మరో బాహుబలి అవడం ఖాయమని అంటున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష