వినాయక్ మొదలు పెట్టేశాడు..!

September 22, 2017


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం జవాన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ప్రస్తుతం కరుణాకరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక అదే కాకుండా వినాయక్ తో సినిమా కూడా ఈరోజు నుండి సెట్స్ మీదకు వెళ్లింది. ఖైది నంబర్ 150తో హిట్ అందుకున్న వినాయక్ ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడు. స్టార్ హీరోలెవరి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ప్రస్తుతం సాయి ధరం తేజ్ తో ఫిక్స్ చేశాడు.

సి.కళ్యాణ్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కొద్దిరోజులుగా డిస్కషన్స్ లో ఉన్నా ఎట్టకేలకు ఈరోజు సెట్స్ మీదకు వచ్చింది. తిక్క, విన్నర్ సినిమాల ఫలితాలు నిరాశ పరచడంతో జవాన్ నుండి కథల విషయంలో జాగ్రత్తపడుతున్నాడు సాయి ధరం తేజ్. ఆకుల శివ కథ అందించిన ఈ సినిమాకు దుర్గ అని టైటిల్ పెట్టబోతున్నారట. వినాయక్ తో కూడా మొదలు పెట్టిన సాయి ధరం తేజ్ ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష