ఎన్టీఆర్ కోసం కథ రాయలేదా..!

September 20, 2017


img

ఎన్.టి.ఆర్ హీరోగా ముచ్చటగా మూడు పాత్రలతో వస్తున్న సినిమా జై లవ కుశ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కథ రాసిన బాబి అసలు తారక్ కోసం ఈ కథ రాయలేదని అన్నాడు. పవర్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తీసిన బాబి కాస్త అబాసు పాలవగా ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఈ కథ రాసుకున్నాడు. అయితే కథ రాసుకున్న వెంటనే కొరటాల శివకు వినిపించగా ఈ కథకు తారక్ అయితే బాగుంటాడని సలహా తీసుకున్నాడట.

ఇక అప్పటి నుండి తారక్ తో కథా చర్చలు నడిచే వరకు సినిమా తారక్ తో తీస్తున్నానా లేదా అన్న టెన్షన్ మొదలైందట. ఇక తన కన్నా కథ మీద ఎన్.టి.ఆర్ ఎక్కువ ఓన్ చేసుకున్నాడని అంటున్నాడు బాబి. ఈ సినిమాలో తారక్ నట విశ్వరూపం చూస్తారని.. తప్పకుండా ఈ సినిమా తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని అంటున్నాడు బాబి.  



Related Post

సినిమా స‌మీక్ష