మహేష్ సినిమాలో విలన్ ఎవరు..?

December 04, 2020


img

సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా 2021 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ రెండు పెద్ద బ్యానర్ లు కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారి. మహేష్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ జత కడుతున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిసుత్న్నాడు.

ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా మహేష్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ విలన్ గా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఈమధ్య కోలీవుడ్ హీరో కం విలన్ అరవింద స్వామి కూడా మహేష్ విలన్ గా చేస్తాడని అన్నారు. అయితే అనీల్, అరవింద్ ఈ ఇద్దరిలో మహేష్ సర్కారు వారి పాటలో విలన్ ఎవరన్నది మాత్రం కన్ ఫర్మేషన్ రాలేదు. అసలు ఈ ఇద్దరు కాకుండా మరో విలన్ ఎవరైనా చేస్తారా అనంది కూడా తెలియాల్సి ఉంది. సర్కారు వారి పాట నుండి అఫీషియల్ అప్డేట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష