ఆదిపురుష్ తో పాటే సలార్..!

December 03, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ మూవీ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. రాధే శ్యాం సినిమా చేస్తున్న ప్రభాస్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ ఎనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే నాగ్ అశ్విన్ సినిమా ఉన్నా సరే ప్రశాంత్ నీల్ తో మూవీ ప్రకటించాడు. అయితే ఈ సినిమా ఆదిపురుష్ సినిమాతో ఈక్వల్ గా షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. ఎలాగు రాధే శ్యాం సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.

ఆదిపురుష్ సినిమా కూడా జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ సలార్ సెట్స్ మీదకు వెళ్తాడని తెలుస్తుంది. ఆదిపురుష్, సలార్ పార్లర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడట ప్రభాస్. సో ప్రభాస్ ఫ్యాన్స్ వరుస సినిమాలతో పండుగ చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష