త్రిషతో ఆ రీమేక్..?

November 26, 2020


img

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ 20 ఏళ్లకు పైగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తుంది. ఇప్పటికి అమ్మడు సూపర్ ఫాంలో ఉంది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయని త్రిష తమిళంలో మాత్రం వరుస ఆఫర్లు అందుకుంటుంది. అక్కడ 96 మూవీతో సూపర్ ఫాంలోకి వచ్చింది అమ్మడు. 96 తర్వాత కోలీవుడ్ లో త్రిష వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. లేటెస్ట్ గా త్రిష బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. 

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పీకూ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. బడా నిర్మాత ఆ సినిమా రైట్స్ కొనేశారట. త్రిషతో అయితే తెలుగు, తమిళంలో వర్క్ అవుట్ అవుతుందని ఆమెను సెలెక్ట్ చేశారట. సుజిత్ సర్కార్ డైరక్షన్ లో వచ్చిన పీకూ సినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ కలిసి నటించారు. అయితే ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, నిహారిక చేయాలని అనుకున్నారు కాని కుదరలేదు. ఫైనల్ గా ఆ క్రేజీ ప్రాజెక్ట్ త్రిష చేతికి వెళ్లింది. మరి అమితాబ్ చేసిన పాత్రలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష