ఆర్జివీకి హైకోర్డ్ షోకాజ్ నోటీసులు

November 24, 2020


img

రియల్ క్రైం స్టోరీస్ లను తన కథా వస్తువులుగా వాడుకునే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఈ మధ్య షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆల్రెడీ మర్డర్ సినిమా గురించి గొడవ జరుగుతుండగా లేటెస్ట్ గా దిశ ఎన్ కౌంటర్ సినిమాపై ఆర్జీవికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. దిశ ఎన్ కౌంటర్ సినిమాను ఆపేయాలని నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని.. వారిని మరింత బాధించడం సరికాదని పిటీషనర్ తరపున లాయర్ కృష్ణమూర్తి కోర్టుకి తెలిపారు.   

ఈ సినిమా తీసి వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని అన్నారు కృష్ణమూర్తి. సినిమా రిలీజ్ కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. ఓ పక్క ఈ సంఘటనపై జ్యుడీషియల్ కమీషన్ విచారణ జరుగుతుంది.. అలాంటి టైం లో ఈ సినిమా ఎలా తీస్తారని కృష్ణమూర్తి అన్నారు. డైరక్టర్ రాం గోపాల్ వర్మలకు షోకాజు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.  



Related Post

సినిమా స‌మీక్ష