ఎన్.టి.ఆర్ తో రొమాన్స్ చేసేది ఎవరు..?

November 23, 2020


img

ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అరవింద సమేత తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో మరో క్రేజీ సినిమా రాబోతుంది. ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన మొన్నటివరకు పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు కాని లేటెస్ట్ గా పూజా ప్లేస్ లో మరో ఇద్దరు హీరోయిన్స్ డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే రష్మిక మందన్న, కియరా అద్వాని తెలుస్తుంది. కన్నడ భామ రష్మిక మందన్న సూపర్ ఫాంలో ఉంది. తెలుగులో ఆమె వరుస స్టార్ అవకాశాలు అందుకుంటుంది. కియరా అద్వాని కూడా మహేష్ తో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఎన్.టి.ఆర్ తో రష్మిక, కియరా అద్వాని ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష