ప్రభాస్ తో సినిమా.. మినిమం 300 కోట్లు..?

October 30, 2020


img

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. అంతకుముందు కేవలం తెలుగు స్టార్ హీరోగా మాత్రమే ఉన్న ప్రభాస్ బాహుబలి తర్వాత నేషనల్ స్టర్ గా మారాడు. ప్రభాస్ కు పెరిగిన ఈ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. బాహుబలి తర్వాత సాహో కూడా 150 కోట్ల దాకా పెట్టారు.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యాం సినిమా కూడా 200 కోట్ల బడ్జెట్ తో వస్తుంది. తర్వాత చేస్తున్న ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు కూడా 400 కోట్ల బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు మినిమం 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. అలా అయితేనే నిర్మాతలకు ఛాన్స్ ఇస్తున్నాడట ప్రభాస్. ధూం 4 సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తాడని తెలుస్తుంది. మొత్తానికి సౌత్ స్టార్ కాస్త నేషనల్ స్టార్ గా బాలీవుడ్ ఖాన్ లకు గట్టి పోటీ ఇస్తున్నాడు ప్రభాస్.    



Related Post

సినిమా స‌మీక్ష