శర్వానంద్ తో రష్మిక..!

October 24, 2020


img

కిశోర్ తిరుమల డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా ఆడాళ్లూ మీకు జోహార్లు. దసరా సందర్భంగా మొదలవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న రష్మిక అటు స్టార్ హీరోలతో నటిస్తూనే యువ హీరోలతో రొమాన్స్ చేస్తుంది.

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తుంది. ఈ ఇయర్ మొదట్లో సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్ పుష్పలో కూడా ఛాన్స్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా శర్వానంద్ సరసన కూడా లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా స్పెషల్ గా ఉంటుందని టాక్. 



Related Post

సినిమా స‌మీక్ష