క్రిష్ మొత్తానికి పూర్తి చేశాడు..!

October 24, 2020


img

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో ఒకరైన క్రిష్ సినిమా తక్కువ రోజుల్లో పూర్తి చేసినా క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న క్రిష్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆ సినిమా 15 రోజుల షూటింగ్ పూర్తి చేశారు. అయితే మధ్యలో కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.

కొండపొలం నవల ఆధారంగా వైష్ణవ్ తేజ్ సినిమా వస్తుందని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే మొదలు పెట్టిన క్రిష్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశాడని తెలుస్తుంది. సినిమా అనుకున్న విధంగా పూర్తి చేయడం అందరి వల్ల సాధ్యం కాదు అది కూడా ఇలాంటి టైంలో అది ఇంకా కష్టం కాని క్రిష్ మాత్రం అనుకున్న టైం కల్లా సినిమా పూర్తి చేశాడు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కు రెడీ అయ్యింది. కాని ఆ సినిమా కన్నా ముందు క్రిష్ సినిమా రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష