ఏంటి రష్మికి కరోనా..?

October 22, 2020


img

రీసెంట్ గా సుడిగాలి సుధీర్ కు కరోనా వచ్చిందని వార్తలు రాగా దసరా ఈవెంట్లలో సుధీర్ తో పాటు ఈవెంట్ లో పాల్గొన్న కొంతమంది ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్నారని తెలుస్తుంది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా సుధీర్ ఆన్ స్క్రీన్ జోడీ రష్మికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. సుధీర్, రష్మిలకు కరోనా అని తెలియగానే ఢీ, జబర్దస్త్ షోలో ఉన్న మిగతా వారంతా టెన్షన్ లో పడ్డారు.

ప్రస్తుతం వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే రెండు మూడు వారాల పాటు బ్యాకప్ ఉన్నా సరే వీరు అబ్సెంట్ అయితే మాత్రం ఈ రెండు షోలకు పెద్ద దెబ్బ పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఢీ, జబర్దస్త్ షోలో వీరిద్దరు ఇంకా ఎంతమందికి ఇది అంటించి ఉంటారన్నది టెస్టుల ఫలితాలు వస్తేనే కాని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష