F2కి ఇండియన్ పనోరమ అవార్డ్

October 21, 2020


img

ఓ సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు తెస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. 2019లో రిలీజై సూపర్ హిట్ కలక్షన్స్ సాధించిన ఎఫ్-2 ఇప్పుడు ఇండియన్ పనోరమ అవార్డ్ అందుకుని మరింత క్రేజ్ తెచ్చుకుంది. గత ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించిన ఎఫ్-2 ఇప్పుడు తన ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వేసుకుంది. 

అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించారు. క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా ఎఫ్-2 సినిమాకు అందులో స్థానం. ఈ సినిమా డైరక్టర్ అనీల్ రావిపుడి ఈ అవార్డ్ అందుకోనున్నారు. వివిధ భాషలకు చెందిన 26 సినిమాలను కేంద్ర సమాచార శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.      



Related Post

సినిమా స‌మీక్ష