సూపర్ సార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరన్నది కొన్నాళ్లుగా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. అయితే ఫైనల్ గా సర్కారు వారి పాట హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను ఫిక్స్ చేశారు.
శనివారం కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా మహేష్ టీం నుండి బర్త్ డే విషెష్ అందించారు. సో అలా ఫైనల్ గా సర్కారు వారి టీంలో మహేష్ తో కీర్తి సురేష్ రొమాన్స్ చేస్తుందని తెలుస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా 2021 జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్తుందని ఫిల్మ్ నగర్ టాక్.