నితిన్ నాట్ ఇంట్రెస్టెడ్..!

September 22, 2020


img

ఈ ఇయర్ భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తున్నారు. రంగ్ దే అంటూ రాబోతున్న నితిన్ ఈ సినిమాలో కీర్తి సురేష్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీ నిర్మిస్తున్నారు. మొన్నామధ్య రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించింది.

కరోనా లాక్ డౌన్ తర్వాత త్వరలో షూటింగ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా ఓటిటి రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు నితిన్. రంగ్ దే సినిమాకు జీ5, అమేజాన్ ప్రైమ్ ల నుండి ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయట. జీ5 తో రంగ్ దే మేకర్స్ డీల్ క్లోజ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. తన సినిమా ఓటిటి రిలీజ్ పై నితిన్ అంతగా సుముఖంగా లేడని తెలుస్తుంది. ఓటిటి లో రిలీజైన సినిమాలు హిట్ అవకపోవడంతో నితిన్ ఓటిటి రిలీజ్ ఇంట్రెస్ట్ చూపట్లేదని తెలుస్తుంది.                 

సంక్రాంతి వరకు థియేటర్స్ ఓపెన్ అయితే 2021 సంక్రాంతి రేసులో రంగ్ దేని దించాలని చూస్తున్నారు. సినిమాపై నితిన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. తొలిప్రేమతో తొలి సినిమా హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ అట్లూరి రెండో సినిమా మిస్టర్ మజ్ను ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మరి మూడవ సినిమా రంగ్ దే మళ్ళీ అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.    

 


Related Post

సినిమా స‌మీక్ష