టాలీవుడ్ స్టార్స్ అందరికి ఆయనే కావాలట..!

August 12, 2020


img

కన్నడ సినిమా కె.జి.ఎఫ్ తో సంచలన విజయం అందుకున్నాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్. శాండల్ వుడ్ పరిశ్రమలో కనీ విని ఎరుగని రికార్డులను సృష్టించిన కె.జి.ఎఫ్ సినిమాతో హీరోగా యశ్, డైరక్టర్ గా ప్రశాంత్ నీల్ తమ సత్తా చాటారు. అంచనాలు ఏమి లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్టైన ఈ సినిమా సెకనండ్ పార్ట్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తాడని తెలుస్తుంది. 

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఆల్రెడీ మహేష్ కూడా సరైన కథ దొరికితే ప్రశాంత్ నీల్ తో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మొత్తానికి టాలీవుడ్ స్టార్స్ అందరికి కె.జి.ఎఫ్ డైరక్టర్ పై కన్ను పడ్డది. ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత ప్రభాస్, మహేష్ ఇలా టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న ఈ డైరక్టర్ ఫామ్ మాములుగా లేదని చెప్పొచ్చు.    



Related Post

సినిమా స‌మీక్ష